ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 6, 2019, 8:00 PM IST

ETV Bharat / city

విశాఖ ఉత్సవ్ నిర్వహణ​పై మంత్రి ముత్తంశెట్టి సమీక్ష

విశాఖ ఉత్సవ్ నిర్వహణపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28, 29వ తేదీల్లో రెండ్రోజుల పాటు జరిగే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Minister avanti review on visakha ustav
విశాఖ ఉత్సవ్ నిర్వహణ​పై మంత్రి ముత్తంశెట్టి సమీక్ష

విశాఖ ఉత్సవ్ నిర్వహణ​పై మంత్రి ముత్తంశెట్టి సమీక్ష
ఈ నెల 28, 29వ తేదీల్లో జరగనున్న 'విశాఖ ఉత్సవ్'​పై పర్యటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో పర్యటకశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులు పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు ఇతర జిల్లాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భారీగా పర్యటకులు వచ్చే అవకాశం ఉందని మంత్రి అన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉత్సవాల్లో సాంస్క్రతిక కార్యక్రమాలు, ప్లవర్ షో, కార్నివాల్ నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details