ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 9, 2020, 5:14 AM IST

ETV Bharat / city

ఎల్​జీ పాలిమర్స్​ సిబ్బంది లోపలికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి

ఎల్​జీ పాలిమర్స్​లో ఉన్న రికార్డుల నిర్వహణ కోసం ఆ సంస్థ అకౌంట్స్ విభాగం సిబ్బంది 16 మంది లోపలికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. వారు వెళ్లే ప్రాంగణాన్ని సీసీ కెమెరాలతో సమోదు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎల్​జీ పాలిమర్స్​ సిబ్బంది లోపలికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి
ఎల్​జీ పాలిమర్స్​ సిబ్బంది లోపలికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి

విశాఖ ఎల్​జీ పాలిమర్స్ ఘటనపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. ఎల్​జీ పాలిమర్స్​లో ఉన్న రికార్డుల నిర్వహణ కోసం ఆ సంస్థ అకౌంట్స్ విభాగం సిబ్బంది 16 మంది లోపలికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. వారు వెళ్లే ప్రాంగణాన్ని సీసీ కెమెరాలతో సమోదు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి..,జస్టిస్ లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details