విశాఖ ఆరిలోవలో రెండు రోజుల క్రితం జరిగిన రౌడీషీటర్ సాయి హత్య ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అతడితో పాటు ఉంటూ కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. సాయి నుంచి ఎదురవుతున్న వేధింపులు భరించలేకే అతడి ప్రాణాన్నీ తీసినట్లు అనుమానిస్తున్నారు. రౌడీషీట్ కలిగిన సాయి గతంలో రవీంద్రనగర్లో నివాసం ఉండేవాడు. తనకున్న పరిచయాలతో చిన్నపాటి సెటిల్మెంట్లలో పాలు పంచుకునేవాడు.
ఈ క్రమంలో ఆరిలోవ ప్రాంతానికి చెందిన ఓ గ్యాంగ్తో సాయికి స్నేహం కుదిరింది. ఆరు నెలల క్రితం అతను ఆరిలోవకు మారిపోవటం, తన పరిధిని విస్తరించి కార్యకలాపాలు జరుపుతుండటంతో ఆ గ్యాంగ్కు నచ్చలేదు. తమను చిన్న చూపు చూస్తున్నాడని, పోలీసులకు తమపై తప్పుడు సమాచారం ఇస్తున్నాడని భావించిన గ్యాంగ్లోని ముగ్గురు యువకులు సాయిని హతమార్చాలని ముందుగానే ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.