ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 31, 2020, 5:05 AM IST

ETV Bharat / city

'నూతన్​నాయుడుతో నాకు ప్రాణహాని ఉంది'

నూతన్​నాయుడుతో తనకు ప్రాణహాని ఉందని విశాఖ శిరోముండనం బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కావాలని కోరారు. దళితుడికి శిరోముండనం చేసిన ప్రతిఒక్కరినీ శిక్షించాలని తెదేపా ఎస్సీ సెల్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

I am in danger of death with Nutan Naidu says tonsure victim
'నూతన్​నాయుడుతో నాకు ప్రాణహాని ఉంది'

'నూతన్​నాయుడుతో నాకు ప్రాణహాని ఉంది'

తన పూర్వపు యజమాని నూతన్​నాయుడుతో తనకు ప్రాణహాని ఉందని విశాఖ శిరోముండనం బాధితుడు భయాందోళన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కావాలని కోరారు. తెదేపా నేతలు బాధితుడిని పరామర్శించారు. దళితుడిపై ఈ ఘాతుకానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విశాఖలో దళితుడికి శిరోముండనం చేసిన ప్రతిఒక్కరినీ శిక్షించాలని తెదేపా ఎస్సీ సెల్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘటన జరిగిన ఇంటి యజమాని నూతన్​నాయుడుని అరెస్ట్ చేయాలని కోరారు. లక్ష రూపాయల చెక్, రూ.50 వేల నగదు, ఔట్​సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చి... ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు.

ఇదీ చదవండీ... విషాదం.. కరెంటు షాక్​తో యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details