Husband killed Wife In Paderu Agency: మద్యం మత్తులో భార్యను హత్యచేసి.. తెలివివచ్చాక తాను చేసిన తప్పు తెలుసుకుని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో చోటు చేసుకుంది.
ఇదీ జరిగింది...
విశాఖ జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయితీ మారుమూల రామారావుపేటలో గణపతి, తులసి అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. గణపతి మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం సేవించి వచ్చి భార్య తులసితో గొడవ పడుతుండేవాడు. సోమవారం రాత్రి కూడా ఎప్పటిలాగే ఫూటుగా మద్యం తాగిన గణపతి..ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడసాగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరడంతో విచక్షణ కోల్పోయిన అతను అక్కడే ఉన్న గొడ్డలితో భార్య తులసి తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మరణించింది.