గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజన నిమిత్తం గత నెల 24న జారీచేసిన తుది గెజిట్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి తీర్పును వాయిదా వేశారు.
వ్యాజ్యానికి విచారణ అర్హత లేదు...
తుది నోటిఫికేషన్ను సవాలు చేస్తూ విశాఖకు చెందిన వెంకట ప్రణవ్ గోపాల్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరపున ప్రత్యేక జీపీ కాసా జగన్మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ .. వార్డుల పునర్విభజనలో ఉల్లంఘనలు ఎక్కడ జరిగాయో పిటిషనర్ స్పష్టంగా పేర్కొనలేదన్నారు. 464 అభ్యంతరాలు స్వీకరించామని అందులో 126ను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. వ్యాజ్యానికి విచారణార్హత లేదని... కొట్టేయాలని కోరారు.