ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 9, 2020, 8:35 PM IST

ETV Bharat / city

పేదలకు నిత్యావసర కిట్లను పంచిన కళంజియ సమాఖ్య ధాన్​ ఫౌండేషన్

విశాఖలోని ఫిషర్​ మెన్​ కాలనీ, పెద్ద జాలరిపేట ఏరియాలో కరోనా పాజిటివ్​ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉండే మహిళలు ఉపాధి కోల్పోతున్నారు. వీరిని ఆదుకునేందుకు కళంజియ సమాఖ్య ధాన్​ ఫౌండేషన్​ నిత్యావసర కిట్లను పంచిపెట్టింది.

grocery kits distributed by kalanjiya samkhya dhan foundation in vizag
ఫిషర్​ మెన్​ కాలనీలో పేదలకు నిత్యావసర కిట్లు పంపిణీ

కరోనా పాజిటివ్​ కేసులు విశాఖ నగరంలో విజృంభిస్తున్నాయి. సముద్రతీరం సమీపంలో ఉన్న ఫిషర్​ మెన్​ కాలనీ, పెద్ద జాలరిపేట ఏరియాలో కరోనా కేసులు అధికంగా పెరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో ఇంటి పనిచేసుకునే మహిళలు ఎక్కువగా ఉండటంతో పనికి వెళ్లలేకపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సాగరతీర కళంజియ సమాఖ్య ధాన్​ ఫౌండేషన్​ పేదలకు నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. ప్రతి కిట్​లో ఐదు కేజీల బియ్యం, కందిపప్పు, గోధుమపిండి, నూనె, పంచదార ఉన్నాయి. సుమారు 60 మందికి రూ.770 విలువగల సరకులు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details