రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్(ఏపీఎస్డీసీ) రుణాల సమీకరణకు విశాఖలోని ప్రభుత్వ భూములు హామీగా దఖలు పర్చేందుకు రంగం సిద్ధమవుతోంది. సీసీఎల్ఏ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నగరంలోని 20 శాఖలకు చెందిన భూముల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. మహారాణిపేట, సీతమ్మధార, గోపాలపట్నం, చినగదలి తహశీల్దార్ కార్యాలయాల పరిధిలో రెండ్రోజులుగా ఇదే పనిలో పడ్డారు.
సుమారు 220 ఎకరాల భూములను గుర్తించి వాటి సర్వే నెంబర్లు, విస్తీర్ణం, విలువ, స్కెచ్లు సహా అందుబాటులో ఉన్న ఇతర రికార్డులను సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల్లో పూర్తి నివేదికను సీసీఎల్ఏకు పంపేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం ముమ్మరంగా పని చేస్తోంది. హామీగా ఇవ్వనున్న ఆస్తుల్లో గవర్నర్ బంగ్లా, కలెక్టరేట్ భవన సముదాయంతో పాటు కొన్ని తహశీల్దార్ కార్యాలయ భవనాలూ ఉన్నాయి.
వలం హామీగా చూపుతారు..