ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అలరిస్తున్న విశాఖ ఉత్సవ్... ఆకట్టుకున్న పుష్ప ప్రదర్శన - flower show vishakha ustsav

విశాఖ ఉత్సవ్ తొలిరోజు సంబరాలు అంబరాన్నంటాయి. సెంట్రల్ పార్కులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆకర్షణలు చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. బీచ్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నగరవాసులను విశేషంగా అలరించాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు గాయనీగాయకులు తమ గానాలతో ఆకట్టుకున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా విశాఖ వాసులు ఉత్సవ్​ను ఆస్వాదించారు.

flower-show-vishakha-ustsav
అలరిస్తున్న విశాఖ ఉత్సవ్... ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

By

Published : Dec 29, 2019, 5:59 AM IST

Updated : Dec 29, 2019, 6:36 AM IST

అలరిస్తున్న విశాఖ ఉత్సవ్... ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
విశాఖ ఉత్సవ్‌ను పురస్కరించుకొని సెంట్రల్‌పార్కులో రంగురంగుల పువ్వులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆకృతులు నగరవాసులకు స్వాగతం పలికాయి. ద్వారాలకు ఏర్పాటు చేసిన పూబంతులు రారమ్మంటూ ఆహ్వానించాయి. పుష్ప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 15 టన్నుల పువ్వులను చూడముచ్చటైన రూపాల్లో తీర్చిదిద్దారు. పదిహేను అడుగల మిక్కీమౌస్, స్పైడర్ మాన్, నెమలి, కుందేలు, జింక సహా 15 రకాల ఆకృతులు చిన్నారులను అమితంగా ఆకట్టుకున్నాయి. సంగీతానికి అనుగుణంగా నీటిని ఆకాశంలోకి చిమ్మే వాటర్ ఫౌంటేన్​ను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.

సెల్ఫీల సందడి...

వైఎస్‌ఆర్‌ సెంట్రల్‌ పార్కు మొత్తం విద్యుత్ ధగధగలతో మెరిసిపోయింది. వేడుకలను తిలకించేందుకు వచ్చిన నగర వాసులతో కిక్కిరిసిపోయింది. పార్కులోని ఆకర్షణలను తమ చరవాణిల్లో బంధించేందుకు నగరవాసులు పోటీపడ్డారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.విశాఖ ఉత్సవ్‌ కార్యక్రమంలో నేడు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ పాల్గొననున్నారు.

Last Updated : Dec 29, 2019, 6:36 AM IST

ABOUT THE AUTHOR

...view details