ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అల్లూరి సీతారామరాజుకు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ నివాళి - minister nirmala seetharaman latest news

విశాఖ జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. రెండో రోజు పర్యటన కొనసాగింది. ఇవాళ కృష్ణదేవీపేటలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్మృతి వనాన్ని ఆమె సందర్శించారు. అల్లూరి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.

nirmala seetharaman vishaka tour
మంత్రి నిర్మల సీతారామన్​

By

Published : Aug 8, 2021, 5:16 PM IST

Updated : Aug 8, 2021, 10:57 PM IST

విశాఖలో కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్

విశాఖ జిల్లా గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలో.. అల్లూరి సీతారామరాజు స్మృతివనాన్ని.. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ సందర్శించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీల్ నరసింహరావుతో కలిసి అల్లూరి సమాధి వద్ద అంజలి ఘటించారు.

అల్లూరి అనుచరుడు గంటం దొర సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచారు. తెల్లదొరలపై దండెత్తిన వీరులందరికీ జోహార్లు అర్పించారు. అల్లూరి తల్లి సూర్యనారాయణమ్మ విగ్రహానికి పూలమాల వేసి భారత్ మతాకీ జై అంటూ నినదించారు. అనంతరం చిన్నారులతో కాసేపు సంభా,ించారు. అల్లూరి ఘన చరితను గుర్తు చేసుకున్నారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం

చిన్న వాల్తేర్​లోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన.. మంత్రికి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 50 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తైనట్లు ఆమె చెప్పారు. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగానే వ్యాక్సినేషన్ ఇస్తోందన్నారు. మరో రెండు వ్యాక్సిన్లకూ అనుమతి లభించిందని.. త్వరలోనే వాటిని సైతం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

మంత్రిని కలిసిన దళిత సంఘాల ఐక్య వేదిక సమితి

ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ పోర్ట్ అతిథి గృహంలో బస చేస్తున్న నిర్మలా సీతారామన్​ను.. దళిత సంఘాల ఐక్య వేదిక సభ్యులు కలిశారు. దళితుల సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమితి కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల కలిగే ఇబ్బందులను మంత్రి దృష్టికి తెచ్చారు.

రేషన్​ పంపిణీపై ఆరా..
కసింకోట మండలం తాళ్లపాలెంలో రేషన్ డిపోను మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలించారు. ప్రధాన మంత్రి గరిబ్ కల్యాణ్ యోజన అమలు తీరుని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక మహిళలతో కాసేపు ముచ్చటింటారు.

కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసిన రేషన్ డీలర్ల సంఘం నాయకులు... తమ సమస్యలు నివేదించారు. కరోనా ప్రభావంతో చనిపోయిన వారిని ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇంటింటికీ రేషన్‌ కారణంగా ఏర్పడిన ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

ఇదీ చదవండి:

జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేసిన సీబీఐ

Last Updated : Aug 8, 2021, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details