నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా కదిరిలో ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. కిసాన్ జ్యోతులతో జీవిమాను సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు నిరసన తెలిపాయి. లక్షలాది మంది రైతులు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ నెల 21న పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.
విశాఖ జిల్లాలో...
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా విశాఖ జిల్లా అనకాపల్లిలో సీపీఐ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. వాటి వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయని అన్నారు.