TTD OSD DOLLAR SESHADRI PASSES AWAY: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి ఎంబామింగ్ చేయమని తితిదే కోరినట్లు ఏఎంసీ ప్రిన్సిపాల్ పీవీ సుధాకర్ తెలిపారు. రవీంద్ర కిశోర్ నేతృత్వంలో అనాటమి విభాగంలో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్టు చెప్పారు. దీనికి రెండు గంటలు సమయం పట్టిందని తెలిపారు. పార్థివ దేహం పాడు కాకుండా ఈ ప్రక్రియ చేసినట్లు వెల్లడించారు.
డాలర్ శేషాద్రి పార్థివ దేహానికి కొవిడ్ నిబంధనలు వర్తించవని పీవీ సుధాకర్ స్పష్టం చేశారు. ఆరోగ్య పరిస్థితుల్లో గుండెపోటు వచ్చిందన్నారు. ఎంబామింగ్ ప్రక్రియ వల్ల ఆరు మాసాలు వరకు భౌతిక దేహం పాడు కాదని చెప్పారు. పార్థివ దేహం ప్రయాణానికి తగ్గట్టు ఏర్పాటు చేసినట్లు పీవీ సుధాకర్ వెల్లడించారు.