ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 26, 2020, 11:48 AM IST

ETV Bharat / city

అమరవీరులకు తూర్పు నౌకాదళం నివాళి

కార్గిల్​ విజయానికి నేటికి 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా విశాఖ సాగరతీరంలో విక్టరీ ఎట్​ సీ స్మారకం వద్ద నౌకాదళం... అమర జవాన్లకు నివాళులర్పించింది.

Eastern Navy paid Tribute to Martyrs in vishaka
Eastern Navy paid Tribute to Martyrs in vishaka

కార్గిల్ విజయ్ దివస్​ పురస్కరించుకుని విశాఖలో తూర్పు నౌకాదళం అమరవీరులకు నివాళులర్పించింది. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ ఏకే జైన్... అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు.

విశాఖ సాగరతీరంలోని విక్టరీ ఎట్ సీ స్మారకం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, విశాఖ మహా నగర పాలక సంస్థ కమిషనర్ డాక్టర్ సృజన.. అమర వీరులకు అంజలి ఘటించారు. కార్గిల్​ యుద్ధంలో ప్రాణాలొడ్డి మాతృభూమిని రక్షించిన సైనికుల త్యాగాలను దేశప్రజలు ఎన్నటికీ మర్చిపోరని ఏకే జైన్ కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details