ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 3, 2019, 2:45 PM IST

ETV Bharat / city

ఆత్మీయ అభినందన సభలో డిప్యూటీ స్పీకర్​కు సత్కారం

విశాఖలో ఆత్మీయ అభినందన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, భాషా సంఘ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు పాల్గొన్నారు.

డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని సత్కరిస్తున్న మిత్ర వర్గం

విశాఖ ఆత్మీయ అభినందన సభలో డిప్యూటీ స్పీకర్ కి ఘనంగా సత్కారం

విశాఖలో ఆత్మీయ అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, శాసన సభ్యుడు మల్లాది విష్ణు, వీఎంఆర్​డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావును వారి మిత్ర వర్గం సత్కరించింది. అనంతరం ఉత్తరాంధ్ర రాజకీయవేత్త ద్రోణంరాజు సత్యనారాయణ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యాక్రమంలో భాషా సంఘ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details