విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా పనులను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ డైరెక్టర్ జె.వి.ఎన్. సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డితో కలిసి ఆయన ఇండస్ట్రియల్ కారిడార్పై సమీక్షించారు. ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించి భూసేకరణ వేగంగా పూర్తి చేయాలన్నారు. కారిడార్కు సంబంధించిన భూమిని గుర్తించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, అభివృద్ధి పనులకు కేటాయించిన భూమిని సంబంధిత శాఖలకు అందజేయాలన్నారు.
'విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా భూసేకరణ పూర్తిచేయండి' - విశాఖ చెన్నై కారిడార్పై పరిశ్రమలశాఖ డైరెక్టర్ సమీక్ష
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్కు త్వరితగతిన భూసేకరణ చేపట్టి, పనులు వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర పరిశ్రామలశాఖ డైరెక్టర్ జె.వి.ఎన్ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. విశాఖలో అధికారులతో చర్చించిన ఆయన...కారిడార్కు సంబంధించిన భూమిని గుర్తించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలన్నారు. కాపులుప్పాడ విద్యుత్ సబ్స్టేషన్ భూగర్భ కేబుల్ వ్యవస్థ అనుమతిపై జీవీఎంసీ, నేషనల్ హైవే అధికారులతో సుబ్రహ్మణ్యం సమీక్షించారు.
!['విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా భూసేకరణ పూర్తిచేయండి' jvn subrahmanyam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8926919-187-8926919-1600967582314.jpg)
నక్కపల్లి మండలం చందనాడ గ్రామంలో నెలకొల్పబోయే సబ్స్టేషన్కు భూమిని, అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు నిర్మించబోయే రహదారి, నక్కపల్లి నుంచి ఇండస్ట్రియల్ క్లస్టర్ వరకు చేసే రహదారులకు భూమి సేకరించాలని ఆదేశించారు. కాపులుప్పాడలోని విద్యుత్ సబ్స్టేషన్ భూగర్భ కేబుళ్లు ఏర్పాటుకు అనుమతిపై జీవీఎంసీ, నేషనల్ హైవే అధికారులతో సమీక్షించారు. ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులో భాగంగా విద్యుత్ వాహనాల కొనుగోలుకు డీపీఆర్ను సమర్పించడంపై కూడా ఆయన సమీక్షించారు.
ఇదీ చదవండి :తగ్గినట్టే తగ్గి పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 7855
TAGGED:
విశాఖ జిల్లా వార్తలు