ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమ్మకానికి విశాఖలోని డీసీఐ వాణిజ్య సముదాయం - విశాఖలో డీసీఐ వార్తలు

డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా స్థిరాస్తులను అమ్మకానికి పెట్టింది. విశాఖలోని హెచ్.బి కాలనీలో కొత్తగా నిర్మిస్తున్న వాణిజ్య సముదాయాన్ని అమ్మకానికి పెట్టింది. ఆర్థిక అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.

dci property in vishaka for sale
dci property in vishaka for sale

By

Published : Jan 28, 2020, 6:51 PM IST

అమ్మకానికి విశాఖలోని డీసీఐ వాణిజ్య సముదాయం

విశాఖలో పోర్టుల కన్సార్టియం నిర్వహణలో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.... ఓ ప్రధాన వాణిజ్య సముదాయాన్ని అమ్మకానికి పెట్టింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.... లిమిటెడ్ కంపెనీగా మారిన తర్వాత భారీస్థాయిలో స్థిరాస్తిని అమ్మకానికి ఉంచింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని హెచ్.బి కాలనీలో మద్దిలపాలెం వార్డులో ఉన్న వాణిజ్య స్థలం విక్రయానికి ఎమ్ఎస్​టీసీ ద్వారా ప్రక్రియ ప్రారంభించింది. ఈనెల 24 వరకు ఆ స్థిరాస్తిని పరిశీలించుకునేందుకు బిడ్డింగ్​లో పాల్గొనే వారికి అవకాశం కల్పించింది. ఈనెల 30న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎమ్ఎస్​టీసీ ఆక్షన్ నిర్వహిస్తుంది.

ఒకే లాట్​గా సముదాయం
మొత్తం 4,455 చదరపు మీటర్ల భవన స్థలం, రెండు బేస్​మెంట్​లు, ఐదు అంతస్తుల వాణిజ్య సముదాయం 90శాతానికిపైగా నిర్మాణం పూర్తి చేసుకుంది. తీవ్రమైన ఆర్థిక అవసరాల దృష్ట్యా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ భవన సమదాయం అమ్మకం ద్వారా కొంత సొమ్మును సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. ఒకే లాట్​గా ఈ సముదాయాన్ని అమ్మకానికి పెట్టింది. బిడ్​లో పాల్గొనే వారు రెండు కోట్ల రూపాయలు ఈఎండీగా చెల్లించాలని నిబంధనల్లో వివరించింది.1987లో వుడా నుంచి ఈ స్థలాన్ని డీసీఐ కొనుగోలు చేసింది. ఇప్పుడు దానిని అమ్మకానికి పెట్టింది.

ఇదీ చదవండి:గంటల వ్యవధిలోనే... కేంద్రానికి మండలి రద్దు తీర్మానం

ABOUT THE AUTHOR

...view details