ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీలో వేకువ జామునే  వైన్స్​... - Curfew from today in AP

కొవిడ్ రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో.. ఏపీలో నేటి నుంచి ఆంక్షలు విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Curfew from today in AP
Curfew from today in AP

By

Published : May 5, 2021, 7:22 AM IST

Updated : May 5, 2021, 10:09 AM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి రోజు రోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ లోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు ఈ నెల 5 నుంచి ఆంక్షలు ఎత్తివేసే వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పగటిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నందున ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్​ భార్గవ్ స్పష్టం చేశారు.

నిత్యావసర సరుకులు, ఇతర కార్యకలాపాలకు పరిమితంగా అనుమతి ఇవ్వగా.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణా ఆర్టీసీ బస్సులు సహా అన్ని వాహనాల రవాణాను నిలిపి వేయనున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..

Last Updated : May 5, 2021, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details