ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏపీలో వేకువ జామునే  వైన్స్​...

By

Published : May 5, 2021, 7:22 AM IST

Updated : May 5, 2021, 10:09 AM IST

కొవిడ్ రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో.. ఏపీలో నేటి నుంచి ఆంక్షలు విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Curfew from today in AP
Curfew from today in AP

రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి రోజు రోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ లోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు ఈ నెల 5 నుంచి ఆంక్షలు ఎత్తివేసే వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పగటిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నందున ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్​ భార్గవ్ స్పష్టం చేశారు.

నిత్యావసర సరుకులు, ఇతర కార్యకలాపాలకు పరిమితంగా అనుమతి ఇవ్వగా.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణా ఆర్టీసీ బస్సులు సహా అన్ని వాహనాల రవాణాను నిలిపి వేయనున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..

Last Updated : May 5, 2021, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details