ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 13, 2021, 9:35 PM IST

ETV Bharat / city

రక్షణ దళాల సిబ్బందికి కరోనా టీకా.. వ్యాక్సిన్ తీసుకున్న వైస్ అడ్మిరల్ అతుల్ జైన్

రక్షణ దళాల సిబ్బందికి కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియ అరంభమైంది. ఇప్పటివరకు తొలి ఆరోగ్య సిబ్బందికి మాత్రమే నౌకాదళంలో మొదటి డోస్ వాక్సినేషన్ పూర్తయింది.

covid vaccination in Navy force
రక్షణ దళాల సిబ్బందికి కరోనా టీకా.

రక్షణ దళాల సిబ్బందికి కొవిడ్ వ్యాక్సినేషన్​ ప్రారంభించారు. విశాఖలోని ఐఎన్​హెచ్​ఎస్ కళ్యాణిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మొదటి టీకాను తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్​ తీసుకున్నారు. నౌకాదళాల్లో తొలి వరుసలో పని చేసే నావికులు, అధికారులకు టీకా ఇచ్చారు.

ఇప్పటివరకు తొలి ఆరోగ్య సిబ్బందికి మాత్రమే నౌకాదళంలో మొదటి డోస్ పూర్తయింది. వాళ్లకు రెండో డోస్ ఇచ్చే ప్రక్రియను ఏకకాలంలో నడిపేందుకు చర్యలు చేపట్టినట్టు నౌకాదళం వెల్లడించింది.

ఇదీ చదవండీ...విశాఖలో కొత్త రాజధాని ఏర్పాటు అసాధ్యం: ఎంపీ రఘురామ

ABOUT THE AUTHOR

...view details