విశాఖ విమ్స్ లో కరోనా చికిత్స పొందుతున్న వ్యక్తి.. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమిలి ప్రాంత గొళ్లపాలానికి చెందిన ఎం.వేణు బాబు(37) ఈ నెల 1న విమ్స్ లో చేరి కరోనా చికిత్స పొందుతున్నాడు. ఏమవుతుందోననే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో ఇలాంటి ఘటన జరగడం రెండో సారి. ఇప్పటి వరకు విమ్స్లో ఇద్దరు, కేజీహెచ్సీఎస్ ఆర్ వార్డులో నలుగురు ఆత్మహత్య చేసకున్నారు.
విశాఖలో.. కరోనా రోగి ఆత్మహత్య - విశాఖలో కరోనా రోగి ఆత్మహత్య వార్తలు
కరోనా సోకి చికిత్స పొందుతున్న రోగి.. విశాఖలో విమ్స్ భవనం నుంచి కిందకు దూకి.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇప్పటి వరకు విశాఖలో కరోనా భయంతో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
![విశాఖలో.. కరోనా రోగి ఆత్మహత్య విశాఖలో.. కరోనా రోగి ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11996748-1085-11996748-1622690777184.jpg)
విశాఖలో.. కరోనా రోగి ఆత్మహత్య
Last Updated : Jun 3, 2021, 11:53 AM IST