ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జనతా కర్ఫ్యూకు సిద్ధమవుతున్న ప్రజలు

By

Published : Mar 21, 2020, 3:27 PM IST

విశాఖలో జనతా కర్ఫ్యూకు ప్రజలు సిద్ధమవుతున్నారు. రహదారులపై ఇప్పటికే రాకపోకలు తగ్గిపోయాయి. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించి రాకపోకలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులను ఉచితంగా డెలివరీ చేస్తామని వ్యాపార సంస్థలు ఆఫర్లు ఇస్తున్నాయి.

corona-effect-in-vishaka-city
corona-effect-in-vishaka-city

విశాఖలో జనతా కర్ఫ్యూకు సిద్ధమవుతున్న ప్రజలు

ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం నిర్వహించే.. జనతా కర్ఫ్యూ కోసం విశాఖ ప్రజలు సిద్ధమవుతున్నారు. సరుకులను ముందుగానే సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే రహదారులపై వాహనాల రాకపోకలు మందగించాయి. రద్దీ ప్రదేశాలకు వెళ్లే వారంతా... మాస్కులు ధరించి సంచరిస్తున్నారు. నిత్యావసర సరుకుల కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే.. ఉచితంగా డెలివరీ చేస్తామని కొందరు వ్యాపారులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details