ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్.. ప్రత్యామ్నాయ బాట పట్టిన ఏపీటీడీసీ - corona effect on APTDC

కొవిడ్ సవాళ్లను అధిగమిస్తూ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యామ్నాయ బాట పట్టింది. అనేక సంస్థలు కరొనా మిగిల్చిన నష్టాలను పూడ్చలేక ఉద్యోగుల్ని తొలగిస్తుంటే... ఏపీటీడీసీ మాత్రం వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. కరోనా బాధితులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ సేవా స్ఫూర్తిని చాటుతోంది.

Corona effect .. APTDC taking an alternative path
ప్రత్యామ్నాయ బాట పట్టిన ఏపీటీడీసీ

By

Published : Oct 19, 2020, 5:10 AM IST

ప్రత్యామ్నాయ బాట పట్టిన ఏపీటీడీసీ

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అన్ని రంగాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. ఏపీటీడీసీ మాత్రం మంచి లాభాల బాటలో కొనసాగుతోంది. కొవిడ్ సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న లక్షల మంది బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లతో ఆహారం సరఫరా చేసింది. ప్రస్తుతం రోజుకు 7 వేల 700 మందికి ఆహార పొట్లాలను సరఫరా చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు రూ.7 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చుకుంది. 4 లక్షల మందికిపైగా బాధితులు పౌష్టికాహారాన్ని ఏపీటీడీసీ ద్వారా తీసుకున్నారు.

ప్రత్యేక శ్రద్ధతో అందిస్తున్న ఆహారం కొవిడ్ రోగులకు సాంత్వన కలిగిస్తోంది. మధ్యాహ్న భోజనంలో కోడి మాంసంతో పాటు వేపుడు కూర, పప్పు, అన్నం అందిస్తున్నారు. రాత్రి భోజనంలో చపాతి, కూర, పప్పు, పచ్చడి ఇస్తున్నారు. వీటితో పాటు రాగిజావ, మిరియాల పాలు, పండ్ల ముక్కలు, రోజుకు మూడు గుడ్లు ఇవ్వడంతో పాటు అల్పాహారం విషయంలోనూ ప్రత్యేకత కనబరుస్తున్నారు. మొత్తం 8 జిల్లాల్లోని 11 కేంద్రాల నుంచి ఏపీటీడీసీ ద్వారా వివిధ ఆసుపత్రులకు ఆహారం సరఫరా అవుతోంది. మంచి ఆహారం అందించడం పట్ల కొవిడ్ రోగుల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. పౌష్టికాహారం తీసుకోవడం కారణంగా త్వరగా కొలుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది.

ఇదీ చదవండీ... బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం

ABOUT THE AUTHOR

...view details