విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిరసిస్తూ ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. స్టీల్ప్లాంట్ బ్యాక్ గేట్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్మికులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. కార్మికుల ఆందోళనకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతితోపాటు వైకాపా ఎంపీలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డితోపాటు పలవురు నేతలు పాల్గొన్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని అఖిలపక్షాలు నినదించాయి.
దక్షిణ భారత రాష్ట్రాలను భాజపా పట్టించుకోవట్లేదు...