CM Jagan Visahapatnam Tour: విశాఖలో శుక్రవారం పర్యటించిన సీఎం జగన్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 150 కోట్ల రూపాయలతో వీఎంఆర్డీఏ నిధులతో నిర్మించిన ఫ్లై ఓవర్ను సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. అలాగే 7.60 కోట్లతో పిఠాపురం కాలనీలో నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్ ను, 7.55 కోట్లతో ఆనందరపురం జంక్షన్ నుంచి బోని వరకు 9 కిలోమీటర్ల మేర విస్తరించిన రోడ్డును, 7.50 కోట్లతో అభివృద్ధి చేసిన పెదరుషికొండ - బీచ్ మాస్టర్ ప్లాన్ రోడ్డును ప్రారంభించారు. 6.97 కోట్లతో అభివృద్ధి చేసిన విశాఖ వ్యాలీ రోడ్డును, 5.14 కోట్లతో చినముషిడివాడలో నిర్మించిన కల్యాణ మండపాన్ని, 1.56 కోట్లతో తాడిచెట్లపాలెంలోని ధర్మానగర్లో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఎన్ఏడీ వేదిక పై స్విచ్ నొక్కి ప్రారంభించారు.
సీఎం చేతుల మీదుగా ఉడా పార్కు ప్రారంభోత్సవం..
విశాఖ సాగర తీరంలో అందాలకు చిరునామాగా మారిన ఉడా పార్కు సుందరీకరణ పనుల అనంతరం శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా మహా విశాఖ నగర పాలక సంస్థ (జి.వి.ఎం.సి) ఆధ్వర్యంలో సుమారు రూ.61 కోట్లు వెచ్చించి నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఉడా పార్కు వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సం జరిగింది. ఈ క్రమంలో రూ.33.50 కోట్లతో ఉడా పార్కులో చేపట్టిన అభివృద్ధి పనులను, రూ.11.45 కోట్లు వెచ్చించి జగదాంబలో నిర్మించిన మల్టీ లెవెల్ సెమీ ఆటోమెటిక్ కార్ పార్కింగ్ కేంద్రాన్ని, రూ.4.65 కోట్లతో దండు బజార్లో అభివృద్ధి చేసిన ఎంవీడీ ఉన్నత పాఠశాలను, రూ.4.24 కోట్లతో అభివృద్ధి చేసిన హెరిటేజ్ కన్జర్వేషన్ హాలును, రూ.7.16 కోట్లతో అభివృద్ధి చేసిన ఓల్డ్ మున్సిపల్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం స్థానిక పార్కులో కాసేపు పర్యటించి నూతనంగా అభివృద్ధి చేసిన పనులను పరిశీలించారు. ఈ నెల 21న రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న వైఎస్సార్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీని ముఖ్యమంత్రి ఉడా పార్కులో ఆవిష్కరించారు.
వెంకయ్య నాయుడు మనవరాలి రిసెప్షన్లో..