కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు... అపరిశుభ్రతతో పారిశుద్ధ్య కార్మికులు రోజూ యుద్ధం చేస్తున్నారు. మరోవైపు ఆర్థిక పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలో పెద్ద వాల్తేరులోని ఛాతి ఆసుపత్రిలో కరోనా రోగి వద్దకు నేరుగా వెళ్లి పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందిస్తున్నారు.
'ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాం... వేతనాలు చెల్లించండి' - విశాఖ ఛాతి ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు ధర్నా తాజా న్యూస్
ప్రాణాలు పణంగా పెట్టి కరోనా రోగి దగ్గరకు నేరుగా వెళ్లి సేవలు అందిస్తున్నారు ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. వార్డులో పని చేసి ఇంటికి వెళ్తే కాలనీలవాళ్లు... వారిని రానివ్వడంలేదు. ఇంటి యజమానులు అద్దె కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. అలాంటి కార్మికులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన జీతాలు కూడా ఆలస్యం అవుతున్నాయి. అయినా కరోనా వ్యాప్తి నివారణ కోసం శ్రమిస్తున్నారు. ప్రభుత్వం తమకు వెంటనే వేతనాలు చెల్లించాలని వేడుకుంటున్నారు.
!['ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాం... వేతనాలు చెల్లించండి' వేతనాలు చెల్లించాలంటూ ఛాతి ఆసుపత్రి పారిశుధ్య కార్మికుల ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7068314-727-7068314-1588668516559.jpg)
వేతనాలు చెల్లించాలంటూ ఛాతి ఆసుపత్రి పారిశుధ్య కార్మికుల ఆందోళన
అయితే తమకు మూడు నెలల నుంచి వేతనాలు అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డులో పని చేసి ఇంటికి వెళ్తే కాలనీ వాళ్లు నిరాకరిస్తున్నారని... అద్దె కోసం ఇంటి యజమానులు ఒత్తిడి చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. ఇంత కష్టపడుతున్న తమకు అందాల్సిన వేతనాలు ఇవ్వడంలో ప్రభుత్వం, అధికారులు ఆలస్యం వహించడం బాధ కలిగిస్తోందంటూ కన్నీటిపర్యంతమయ్యారు.