ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎంను విమర్శించిన అయ్యన్నపై కేసు

ముఖ్యమంత్రి పాలనపై తీవ్ర ఆరోపణలు చేసినందుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

By

Published : Sep 28, 2019, 6:40 AM IST

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు

మాజీ మంత్రి, తెదేపా నాయకుడు అయన్నపాత్రుడిపై విశాఖ మూడో పట్టణ పోలీసులు ఈ నెల 25న కేసు నమోదు చేసిన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. జగన్​మోహన్​రెడ్డి ముఖ్యమంత్రి అయితే రౌడీరాజ్యమవుతుందని తాము ముందే చెప్పామని ఈ నెల 24న విశాఖ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖ పోలీసులపైనా ఘాటుగా విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిని విమర్శించడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. సెక్షన్​ 153ఏ, సెక్షన్​ 500, సెక్షన్​ 506 కింద కేసు నమోదు చేశారు. దీన్ని గుట్టుగా ఉంచారు. శుక్రవారం ఇది వెలుగులోకి రావడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రాంతాల మధ్య సామాజిక వర్గాల మధ్య చిచ్చురేపేలా వ్యాఖ్యలు చేశారని డీసీపీ-1 ఎస్​. రంగారావు తెలిపారు. సీఎంపైనా తీవ్ర ఆరోపణలు చేశారన్నారు. అయ్యన్న వ్యాఖ్యలపై ఎ. వెంకటరావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details