GVL on CM Jagan: రాష్ట్రంలో వైకాపా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఓ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన వారిని విస్మరించారని ఆక్షేపించారు. అగ్రకుల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీని గానీ, బీసీని గాని ముఖ్యమంత్రిని చేసే దమ్ము.. జగన్కు ఉందా అని ప్రశ్నించారు.
ఆ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు: జీవీఎల్ - భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు
GVL on CM Jagan: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఓ వర్గానికి ప్రాధాన్యతిచ్చి... మిగిలిన వారిని విస్మరించారని భాజపా నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో వైకాపా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.
BJP MP GVL