విశాఖ రైల్వే స్టేషన్లో బ్యాటరీ కార్లు.. ఒక్కొక్కరికి 45 రూపాయలు - విశాఖ రైల్వే స్టేషన్లో బ్యాటరీ కార్లు
విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు బ్యాటరీ కార్లు అందుబాటులోకి వచ్చాయి. 8 ప్లాట్ ఫాంలలో ఇవి అందుబాటులో ఉండనున్నాయి.
![విశాఖ రైల్వే స్టేషన్లో బ్యాటరీ కార్లు.. ఒక్కొక్కరికి 45 రూపాయలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5053544-161-5053544-1573651853045.jpg)
విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో బ్యాటరీ కార్ల పెయిడ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇవి 24 గంటలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని సర్వీసులను ప్రారంభించిన డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. ఆన్లైన్లోనూ ఈ సేవలు బుక్ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు. స్టేషన్లోని 8 ప్లాట్ ఫాంలలో బ్యాటరీ కార్ల సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో ప్రయాణికుడికి 45 రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. రైలు నుంచి భారీ లగేజ్తో దిగిన వారితో పాటు.. వృద్ధులు, చిన్నారులు, మహిళలకు ఇవి సౌకర్యంగా మారనున్నాయి.