రంగు రంగుల బొమ్మలతో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఆకర్షణీయంగా మారనున్నాయి. విశాఖ నగరం పరిధిలో మొత్తం 600 ఆర్టీసీ బస్లు ఉన్నాయి. వీటిని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు నడుం బిగించారు. సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా బస్లపై రక రకాల చిత్రాలు, చక్కటి ప్రదేశాల బొమ్మలను బస్సులపై 3డి పెయింట్ విధానంతో వేశారు. దీంతో బస్లు చూపరులను కట్టిపడేస్తున్నాయి. విశాఖలో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన ఈ విధానంపై... ప్రజల నుంచి మరింత స్పందన లభిస్తే రాష్ట్రం వ్యాప్తంగా అన్ని నగరాల్లోని ఆర్టీసీబస్లకు ఈ పెయింట్ వేసేందుకు అధికారులు సిద్దమౌతున్నారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు బస్లను ఈ విధంగా మార్చడం జరిగిందని ఆర్టీసీ క్రియాశీలక అధికారులు చెబుతున్నారు.
నూతన ఆవిష్కరణలకు నడుం బిగించిన ఏపీఎస్ఆర్టీసీ - vizag rtc bus new look
ఏపీఎస్ఆర్టీసీ నూతన ఆవిష్కరణలకు నడుం బిగించింది. ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. విభిన్న సంస్కృతి, తెలుగు సంప్రదాయాలను ప్రజలకు చేరువ చేసేందుకు చిరు ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా మొదటి ప్రయత్నంగా విశాఖ నగరంలోని ఆర్టీసీ బస్సులకు రంగు రంగుల చిత్రాలు, చక్కటి ప్రదేశాల బొమ్మలను 3డీ విధానంతో పెయింట్ వేశారు.

నూతన ఆవిష్కరణలకు నడుం బిగించిన ఏపీఎస్ఆర్టీసీ
నూతన ఆవిష్కరణలకు నడుం బిగించిన ఏపీఎస్ఆర్టీసీ
ఇదీ చూడండి:నూతన ఆవిష్కరణలకు నడుం బిగించిన విద్యార్థులు