ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ ధర్మాసనం నుంచి తప్పుకున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ధర్మాసనం నుంచి జస్టిస్ లావు నాగేశ్వరరావు  తప్పుకోవటంతో.. దీపావళి సెలవుల తర్వాత విచారణ జరగనుంది.

By

Published : Nov 3, 2020, 12:25 PM IST

Published : Nov 3, 2020, 12:25 PM IST

ab venkateswar rao case in supreme
సుప్రీంలో ఎ.బి.వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కేసు

ఐపీఎస్ అధికారి ఏబీ.వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ ధర్మాసనం నుంచి జస్టిస్ లావు నాగేశ్వరరావు తప్పుకున్నారు. దీపావళి సెలవుల తర్వాత మరో ధర్మాసనం ముందు విచారణ జరగనుంది.

ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో.. ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ధర్మాసనం నుంచి జస్టిస్ లావు నాగేశ్వరరావు తప్పుకోవటంతో.. కేసు వాయిదా పడింది.

ABOUT THE AUTHOR

...view details