ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

road accident at dharalamma ghat road in vishakapatnam: జీపు బోల్తా పడి.. 15మందికి గాయాలు - విశాఖ జిల్లా దారాలమ్మ ఘాట్ రోడ్డులో జీపు బోల్తా

విశాఖ మన్యంలోని దారాలమ్మ ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. జీపు అదుపుతప్పి బోల్తాపడి.. ఒకే కుటుంబానికి చెందిన 15మంది (road accident at dharalamma ghat road in vishakapatnam) గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

15 members injured in road accident occured at dharalamma ghat road in vishakapatnam
దారాలమ్మ ఘాట్ రోడ్డులో జీపు బోల్తా.. 15మందికి గాయాలు

By

Published : Nov 28, 2021, 9:41 PM IST

విశాఖ మ‌న్యంలో దారాల‌మ్మ ఘాట్ రోడ్డులో జీపు అదుపుత‌ప్పి (road accident at dharalamma ghat road in vishakapatnam) బోల్తాపడింది. ఈ ఘటనలో 15మందికి గాయాలు కాగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

జి.మాడుగుల మండలం బౌడ‌ గ్రామాంలోని ఒకే కుటుంబానికి చెందిన వీరంతా.. గూడెం కొత్తవీధి మండలం ధారకొండ దారాలమ్మ తల్లి దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో.. దారాలమ్మ ఘాట్ రోడ్డులోని నాలుగో మలుపు వద్ద బ్రేకులు ఫెయిలై జీపు అదుపుతప్పి బోల్తాపడింది.

పాదయాత్ర చేస్తున్న గిరిజ‌న జేఏసీ స‌భ్యులు వారిని గమనించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గాయపడ్డవారిని అక్కడి నుంచి చింతపల్లి ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

HOUSE DESTROYED WITH RAINS IN RAILWAY KODURU : వరద ఉద్ధృతికి కూలిన భవనం.. లైవ్ వీడియో

ABOUT THE AUTHOR

...view details