విశాఖపట్నం జిల్లా పెద్ద గంట్యాడ - గంగవరం మార్గంలో లారీ ఢీ కొని పి.పెంటయ్య (42) అనేవ్యక్తి మృతి చెందాడు. మృతుడు పెంటయ్య... స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుడు. అతని మృతదేహాన్ని తీయకుండా గంగవరం మత్స్యకారులు ఆందోళకు దిగారు. ఆ మార్గంలో భారీ వాహనాలు వద్దంటూ పెద్ద సంఖ్యలో ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. ఇద్దరు ఏసీపీలు రంగంలోకి దిగారు. ప్రత్యేక బలగాలను మోహరించారు.
లారీ ఢీ కొని స్టీల్ ప్లాంట్ కార్మికుడు మృతి.. స్థానికుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత - 1 person died in accident
విశాఖ జిల్లా పెద్ద గంట్యాడ - గంగవరం మార్గంలో లారీ ఢీ కొని.. ఓ వ్యక్తి మరణించాడు. మృతుడిని స్టీల్ ప్లాంట్ ఉద్యోగి పెంటయ్యగా గుర్తించారు. స్థానికుల ఆందోళనతో.. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
లారీ ఢీ కొని స్టీల్ ప్లాంట్ కార్మికుడు మృతి
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. ఆందోళనకారులు మరింత ఆగ్రహించారు. ప్రమాదానికి కారణమైన లారీకి నిప్పు పెట్టారు. ఆ వాహనం మంటల్లో తగలబడింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతున్న తరుణంలో.. గంగవరం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పది వెలకుపైగా జనాభా ఉన్న ప్రాంతానికి రెండు గంటలుగా విద్యుత్ నిలిపివేతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.