ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 8, 2019, 8:44 PM IST

ETV Bharat / city

'ఆర్టీసీ ఛార్జీల పెంపుతో పేదలపై భారం'

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో పేదలపై అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు.

yanamala ramakrishnudu on rtc charges hike
yanamala ramakrishnudu on rtc charges hike

ఆర్టీసీ ఛార్జీల పెంపుతో పేదలపై అదనంగా వేయి కోట్ల రూపాయల భారం పడుతుందని... తెదేపా నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో వీలినం చేసి... ఆర్టీసీ బకాయిలు, అప్పులు, నష్టాలు భరిస్తుందని.. ఏవేవో మాటలు చెప్పారని యనమల ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో.. ఛార్జీలు పెంచి వేయి కోట్లు భారం పేదలపై వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ భారాన్ని ప్రజలపై పడకుండా చూడాలని యనమలడిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details