కృష్ణా జిల్లా పెనమలూరులోని కంకిపాడులో.. పట్టపగలే మహిళా దొంగలు కొత్త తరహాలో చోరీకి యత్నించి పట్టుబడ్డారు. పాత కేసులో రెండు నెలల క్రితమే వీరు జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ ఈ ఘటనకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. కంకిపాడు బస్టాండు సమీపంలో నివసించే ఆటో డ్రైవర్ పచ్చిపాల కోటేశ్వరరావు.. తన ఇంటికి గడియ పెట్టి పనులపై బయటకు వెళ్లారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన విజయవాడ మాచవరానికి చెందిన బోయపాటి ధనలక్ష్మి, ఆమె కోడలు సాత్వితలు వచ్ఛి. గడియపెట్టిన ఇంటి తలుపులు తీసి లోపలకు ప్రవేశించారు.
టీవీ, ఫ్యాన్లు వేసుకుని చోరీ..
ఇంటిలోని బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, నగదును సంచిలో వేసుకున్నారు. ఇంటిలోకి ప్రవేశించగానే వీరు టీవీ, ఫ్యాన్లు వేసుకుని చోరీ చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ఇంటి యజమాని కోటేశ్వరరావు ఇంటి వద్దకు వచ్చేసరికి తలుపు తీసి ఉండడం టీవీ మోత వినిపించడంతో పక్కనున్న బంధువులను బయటకు రమ్మని పిలిచి అతను లోనికి వెళ్లి చూశాడు. అప్పటికే లోపలున్న మహిళలిద్దరూ ఏమాత్రం తడబడకుండా మీరు ఎవరు? ఎందుకు వచ్చావని సాక్షాత్తు ఇంటి యజమానినే ప్రశ్నించడంతో అతను అవాక్కయ్యాడు.
ఇంటి యజమానినే ప్రశ్నించిన దొంగలు..