ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సింగ్​నగర్​ను సింగపూర్​గా మారుస్తాం: మంత్రి బొత్స - అజిత్​సింగ్ నగర్ డంపింగ్ యార్డ్ వార్తలు

విజయవాడలోని అజిత్​సింగ్​ నగర్​ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్థానిక డంపింగ్ యార్డ్​ను పూర్తిగా తొలగించి పార్క్​ను ఏర్పాటు చేస్తామన్నారు.

minister bosta
minister bosta

By

Published : Feb 12, 2020, 10:51 PM IST

Updated : Feb 12, 2020, 11:47 PM IST

మీడియాతో మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడలోని అజిత్​సింగ్​నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే 20 లక్షల క్యూబిక్ మీటర్ల చెత్తను బయో మైనింగ్ విధానం ద్వారా శుద్ధి చేసి వేరే చోటకు తరలించామని వెల్లడించారు. మరో 60 వేల టన్నుల చెత్తనూ త్వరలోనే తొలగిస్తామని స్పష్టం చేశారు. అజిత్​సింగ్ నగర్ డంపింగ్ యార్డును విజయవాడ సెంట్రల్​ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు. త్వరలోనే ఇక్కడ పార్క్​ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్న సింగ్​నగర్​ను సింగపూర్​గా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు.

Last Updated : Feb 12, 2020, 11:47 PM IST

ABOUT THE AUTHOR

...view details