ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RAHUL MURDER CASE:కోరాడతో పాటు మరో ముగ్గురికి 14 రోజుల రిమాండ్

By

Published : Aug 27, 2021, 1:00 PM IST

Updated : Aug 27, 2021, 5:18 PM IST

Rahul murder
Rahul murder case

12:57 August 27

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు

విజయవాడలో సంచలనం రేకెత్తించిన యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కీలక నిందితుడు కోరాడ విజయకుమార్​కు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోరాడతో పాటు అతనికి ఆశ్రయం ఇచ్చిన మరో ముగ్గురిని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. నిందితులకు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధించింది. 

కలకలం రేపిన హత్య..

విజయవాడ మొగల్రాజపురం పరిధిలో ఈనెల 19న రాహుల్ అనే వ్యక్తి తన కారులో హత్యకు గురయ్యారు. వ్యాపార వాటాల్లో వివాదమే హత్యకు కారణమని, వ్యాపార భాగస్వామి పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసులో నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. మృతుడి తండ్రి రాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు.

కెనడాలో చదివిన కరణం రాహుల్‌.. స్వదేశానికి వచ్చాక.. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో సిలిండర్ల తయారీ కంపెనీ స్థాపించారు. ఇందులో ముగ్గురు భాగస్వాములున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో కంపెనీకి శంకుస్థాపన చేశారు. పోరంకిలో వారు నివాసం ఉంటున్నారు. అత్యవసరంగా మాట్లాడాలని ఫోన్‌ రాగా బుధవారం రాత్రి 7.30 సమయంలో రాహుల్‌ కారులో బయటకు వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోవారు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అని వచ్చింది. తెల్లవారిన తర్వాతా ఇంటికి రాకపోయేసరికి, రాహుల్‌ తండ్రి రాఘవ.. పెనమలూరు పోలీసులకు చెప్పారు. ఇంతలో వైర్‌లెస్‌ సెట్లో మొగల్రాజపురంలో కారులో మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. మృతుడు రాహుల్‌ అని అతడి తండ్రి గుర్తించి, బోరున విలపించారు. 

ఇదీ చదవండి:rahul murder case: కోగంటి సత్యంకు 14 రోజుల రిమాండ్​

Last Updated : Aug 27, 2021, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details