ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 22, 2022, 8:55 PM IST

ETV Bharat / city

దిల్లీ మద్యం కుంభకోణంలో దొరికినట్లు వైకాపా నేతలు దోరికిపోతారు

Vishnu Vardhan reddy Comments దిల్లీ మద్యం కుంభకోణంలోఆమ్ఆద్మీ నేతలు దొరికినట్టుగా, వైకాపా నేతలు దొరికిపోతారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్టువర్దన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం పూర్తిగా మాఫియాతో నిండిపోయిందని అగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు వాస్తవాలను ప్రస్తావిస్తే వైకాపా నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు.

Etv Bharat
Etv Bharat

Vishnu Vardhan reddy Comments: దిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ఆద్మీ పార్టీ నేతలు దొరికినట్లు, ఆంధ్రప్రదేశ్‌లోనూ వైకాపా నేతలు దొరకడం ఖాయమని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. మద్యపాన నిషేదం చేస్తామని చెప్పి వేల కోట్ల రూపాయల మద్యం విక్రయించడం, ప్రజలను మోసగించడమే అన్నారు. మంత్రులు జోగి రమేష్‌, గుడివాడ అమర్‌నాధ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇసుక గనులు, భూములు, మద్యం మాఫియాతో నిండిపోయిందని విమర్శించారు.కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్‌ఠాకూర్‌ వాస్తవాలను ప్రస్తావిస్తే వైకాపా నేతలకు ఉలుకెందుకని నిలదీశారు. వైకాపా పాలనలో పేదల సొమ్ములు దోచుకున్నారే తప్ప.. వారి అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడిందేమీ లేదని ఏద్దేవా చేశారు.

భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details