ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వాలంటీర్ల తొలగింపు ప్రచారం వాస్తవం కాదు'

గ్రామ వాలంటీర్లను తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలపై గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ జీఎస్ నవీన్ కుమార్ స్పందించారు. తొలగింపుపై వస్తున్న వార్తలు వాస్తవం కాదని స్పష్టం చేశారు.

By

Published : Dec 8, 2020, 5:48 PM IST

'వాలంటీర్ల తొలగింపుపై ప్రచారం వాస్తవం కాదు'
'వాలంటీర్ల తొలగింపుపై ప్రచారం వాస్తవం కాదు'

35 ఏళ్లు నిండిన వాలంటీర్లను తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గ్రామ వార్డు సచివాలయ శాఖ కమిషనర్ జీఎస్ నవీన్ కుమార్ స్పష్టం చేశారు. అనవసరమైన అనుమానాలకు తావిస్తూ వాలంటీర్లను భయాందోళనలకు గురిచేస్తూ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైన కేవలం 6 మందిని మాత్రమే తొలగించాలని తాము ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. మిగిలిన వారెవర్నీ తొలగించేది లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా నియమితులైన వాలంటీర్లు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని నవీన్ కుమార్ సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details