ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయవాడ మేయర్​గా రాయన భాగ్యలక్ష్మీ బాధ్యతల స్వీకరణ

By

Published : Mar 28, 2021, 9:24 PM IST

విజయవాడ నగర పాలక సంస్థ మేయర్​గా రాయన భాగ్యలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించిన దస్త్రాలపై తొలి సంతకం చేశారు.

Vijayawada Mayor Rayana Bhagyalakshmi
విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ బాధ్యతలు స్వీకరణ

విజయవాడ నగర పాలక సంస్థ మేయర్​గా రాయన భాగ్యలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ముహూర్తం ప్రకారం నగర పాలక సంస్ధ కార్యాలయంలోని ఛాంబర్​లో బాధ్యతలు తీసుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరై నూతన మేయర్​ను అభినందించారు.

విజయవాడ నగరంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి దస్త్రాలపై రాయన భాగ్యలక్ష్మి తొలి సంతకం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందించడమే తన లక్ష్యమన్నారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో విజయవాడ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో తామంతా కృషి చేస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ఖజానాలో అసలు డబ్బులు ఉన్నాయా?: గోరంట్ల

ABOUT THE AUTHOR

...view details