విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు నగరంలో ఆకస్మిక పర్యటన చేశారు. పటమట, పెనమలూరు, మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని బెంజ్ సర్కిల్, సనత్ నగర్, మహానాడు జంక్షన్, మధుచౌక్ సెంటర్ ప్రాంతాలను తనిఖీ చేశారు. అర్ధరాత్రి రాకపోకలు సాగిస్తున్న వాహనాలు, వాటి అనుమతులపై ఆరా తీశారు. కృష్ణా జిల్లా రెడ్జోన్ పరిధిలో ఉన్నందున కేసుల సంఖ్య బాగా తగ్గే వరకు లాక్డౌన్ నింబంధనలు కఠినంగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
విజయవాడలో సీపీ ఆకస్మిక పర్యటన - vijayawada cp visiting town news
కృష్ణా జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసులు లాక్డౌన్ పక్కాగా అమలు చేస్తున్నారు. నగరంలో విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాత్రిపూట తిరిగే వాహనాలు, వాటి అనుమతులపై ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.
విజయవాడలో సీపీ ఆకస్మిక పర్యటన