ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్టోబర్​ 1వ తేదీన బాపు మ్యూజియం పునఃప్రారంభం - విజయవాడ బాపు మ్యూజియం ప్రారంభోత్సవం వార్తలు

విజయవాడలోని బాపు మ్యూజియాన్ని రూ.8 కోట్లతో ఆధునికీకరించారు. మ్యూజియాన్ని సీఎం జగన్ అక్టోబర్​ ఒకటో తేదీన పునఃప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంగళవారం అధికారులు సమీక్ష నిర్వహించారు.

అక్టోబర్​ 1వ తేదీన బాపు మ్యూజియం పునఃప్రారంభం
అక్టోబర్​ 1వ తేదీన బాపు మ్యూజియం పునఃప్రారంభం

By

Published : Sep 30, 2020, 4:12 AM IST

పురాతన విగ్రహాలు

విజయవాడ బాపు మ్యూజియాన్ని అక్టోబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి లాంఛనంగా పున: ప్రారంభించనున్నారు. బందరు రోడ్డులోని ఈ మ్యూజియాన్ని ఎనిమిది కోట్ల రూపాయలతో ఆధునికీకరించారు. అత్యాధునిక సాంకేతికతతో మ్యూజియాన్ని అభివృద్ధి చేశామని, కొత్తగా నిర్మించిన భవనంలో ఆదిమ యుగం నుంచి ఆధునిక యుగం వరకు 1500 వస్తువులను ప్రదర్శనలో ఉంచినట్లు పురావస్తుశాఖ కమిషనర్‌ జి.వాణిమోహన్‌ తెలిపారు.

బాపు మ్యూజియంలోని పురాతన విగ్రహాలు

దేశంలోని ఏ మ్యూజియంలో లేని విధంగా స్మార్ట్​ఫోన్​లోని యాప్‌ ద్వారా ప్రదర్శిత వస్తువుల చరిత్ర తెలుసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. మ్యూజియం పున:ప్రారంభోత్సవ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ అహ్మద్‌, నగర పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు సమీక్ష జరిపారు.

పునఃప్రారంభోత్సవంపై అధికారుల సమీక్ష
బాపు మ్యూజియంలోని పురాతన వస్తువులు, విగ్రహాలు

ఇదీ చదవండి :'ప్రతి రోజూ పదివేల మంది భక్తులకు అనుమతి'

ABOUT THE AUTHOR

...view details