మంత్రి వర్గ సమావేశంలోని నిర్ణయాలపై వేమూరి ఆనంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లోటు బడ్జెట్తో ఏర్పాటైన రాష్ట్రంలో చంద్రబాబు సంపద సృష్టించి రైతులకు రుణమాఫీ చేశారని ఆయన అన్నారు. ప్రజల కోసం చంద్రబాబు కష్టపడ్డారని చెప్పారు. 65 వేల కోట్ల బకాయిలు చెల్లించ లేక ప్రభుత్వం పారిపోవాలా అని మంత్రి.. తన అసమర్థతను చాటుకున్నారని ఆక్షేపించారు. అమలు చేయలేని హామీలతో ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నించారు.
''అమలు చేయలేని హామీలతో మోసం చేస్తున్నారు''
మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడం.. మంత్రి పేర్ని నానికే చెల్లిందని బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య విమర్శించారు.
vemuri anand about cabinet decisons
Last Updated : Oct 17, 2019, 11:50 AM IST
TAGGED:
వేమూరి ఆనంద్ సూర్య వార్తలు