కృష్ణా జిల్లాలోని మొవ్వ, గూడురు, కలిదిండి, మచిలీపట్నం మండలాల పరిధిలో వేదాంత సంస్థ 35 చమురు, సహజవాయువు బావులను తవ్వనుంది. ఇది ఆన్షోర్ ప్రాజెక్టు. ఈ ప్రాంతం అంతా కేజీ బేసిన్లోని కాజ బ్లాక్ పరిధిలోకి వస్తుంది. 114.93 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వేదాంత సంస్థకు చెందిన చమురు, సహజ వాయువు విభాగం కెయిర్న్ ఆధ్వర్యంలో సుమారు రూ. 650 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టాలన్నది ప్రతిపాదన. దీనికి సంబంధించిన పర్యావరణ ప్రభావ మదింపు నివేదికను ఈకో కెమ్ సేల్స్ అండ్ సర్వీసెస్ అనే కన్సల్టెన్సీ సంస్థ రూపొందించింది. దీనిపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి...గత ఏడాది డిసెంబరు 17న గూడూరు మండలం తురకతూరులో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయించింది. కానీ కరోనా కారణంగా వాయిదాపడింది. ఇప్పుడు మొవ్వ మండలం కాజలో...ఈనెల 12న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది.
చమురు, సహజ నిల్వల అంచనా..
వేదాంత సంస్థ తవ్వనున్న 35 బావుల్లో మొవ్వ మండలంలో 14, గూడూరులో 18, కలిదిండిలో రెండు, మచిలీపట్నంలో ఒకటి ఉన్నాయి. ఈ బ్లాక్లో చమురు, సహజవాయువు నిల్వలు ఏ మేరకు ఉన్నాయో అంచనా వేసేందుకు ఓఎన్జీసీ గతంలో 3 చోట్ల బావులు తవ్వింది. వాటిలో రెండుచోట్ల ఏమీ లభించలేదు. రాఘవపురం ప్రాంతంలో తవ్విన బావి ద్వారా ఈ ప్రాంతంలో సహజవాయువు ఉందని గుర్తించింది. చమురు నిల్వలూ ఉండే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయానికి వచ్చింది. హైడ్రో ఫ్యాక్చరింగ్ విధానం ద్వారా మరింతగా గ్యాస్ నిల్వల్ని వెలికి తీయవచ్చని అంచనా వేశారు. కాజ బ్లాక్లో తవ్వనున్న 35 బావుల నుంచి రోజుకి 30 వేల బారెళ్ల చమురు, 30 మిలియన్ ఘనపుటడుగుల సహజవాయువు వెలికి తీయలేమని వేదాంత సంస్థ అంచనా వేస్తోంది.
పర్యవరణ శాస్త్రవేత్తల ఆందోళన..