డీజీపీ హైకోర్టుకు వచ్చి సంజాయిషీ ఇవ్వడం భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య దుయ్యబట్టారు. రాష్ట్రంలో అస్తవ్యస్థ అరాచక పాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు. పోలీస్ చరిత్రలో మార్చి 12 ఓ చీకటి రోజన్న వర్ల... తప్పు చేసిన వారిలా డీజీపీ అలా నిలబడటానికి ముఖ్యమంత్రే బాధ్యులని ధ్వజమెత్తారు. సీఎం ఆలోచన సరళిని అనుసరించటం వల్లే డీజీపీ సవాంగ్ దాదాపు 6 గంటలు కోర్టులో ఉండాల్సి వచ్చిందని మండిపడ్డారు. జరిగిన పరిణామాలకు సీఎం రాజీనామా చేసి తలదించుకోవాలని వర్ల డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థ నడవడిక మీద ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో నిన్న బయటపడిందని దుయ్యబట్టారు. పోలీసు అధికారులు సంఘం ఇప్పుడు కూడా హైకోర్టు మీద తొడకొట్టి మీసాలు మెలేస్తుందా అని నిలదీశారు.
పోలీసుల చరిత్రలో మార్చి 12 ఓ చీకటిరోజు: వర్ల రామయ్య - ముఖ్యమంత్రి వల్లే డీజీ హైకోర్టులో ఆరు గంటలు ఉండాల్సి వచ్చిందన్న వర్ల రామయ్య
డీజీపీ హైకోర్టులో తప్పు చేసిన వాడిగా నిలబడటానికి ముఖ్యమంత్రే కారణమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. పోలీసు వ్యవస్థ నడవడిక మీద ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో నిన్న బయటపడిందని దుయ్యబట్టారు.
![పోలీసుల చరిత్రలో మార్చి 12 ఓ చీకటిరోజు: వర్ల రామయ్య Varla ramaih comments on police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6399219-582-6399219-1584122405313.jpg)
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య