గుంటూరు జిల్లా మందడంలోని పోరంబోకు భూమి ఆక్రమణకు గురైందని సీఆర్డీఏ కమిషనర్కు తెదేపా నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఏపీ సచివాలయానికి అతి సమీపంలో ఎప్పటినుంచో ఆ భూమి ఉందని వర్ల లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ స్థలాన్ని ఎంపీ, అతని అనుచరులు ఆక్రమించడంపై మండిపడ్డారు. స్థానిక పోలీసులకు ఈ వ్యవహారం తెలిసినా.. అధికార పార్టీ నేతల హస్తం ఉండటంతో ఏమీ మాట్లాడటం లేదని వర్ల ఆరోపించారు. పోరంబోకు స్థలాన్ని ఆక్రమించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వర్ల డిమాండ్ చేశారు.
ఆ భూమిని వైకాపా ఎంపీ ఆక్రమించారు: వర్ల - వైకాపా ఎంపీపై వర్ల రామయ్య కామెంట్స్
గుంటూరు జిల్లా మందడంలో 15సెంట్ల పోరంబోకు స్థలాన్ని వైకాపా స్థానిక ఎంపీ, అతని అనుచరులు ఆక్రమించారని సీఆర్డీఏ కమిషనర్కు తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
![ఆ భూమిని వైకాపా ఎంపీ ఆక్రమించారు: వర్ల varla ramaiah letter to crda commissioner on Land occupation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7327200-685-7327200-1590314145174.jpg)
varla ramaiah letter to crda commissioner on Land occupation