ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏం అభివృద్ధి చేశారని తిరుపతిలో ఓట్లు అడుగుతున్నారు: వర్ల రామయ్య

ఇసుక, మద్యం అమ్మకాలతో వచ్చిన అవినీతి సొమ్ముని వెదజల్లి వైకాపా తిరుపతి పార్లమెంట్ గెలవాలనుకుంటుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. వైకాపా వాహనాలన్నీ తనిఖీ చేస్తే.. అవినీతి సొమ్ము గుట్టలు గుట్టలుగా బయటపడుతుందన్నారు.

By

Published : Apr 5, 2021, 4:37 PM IST

Published : Apr 5, 2021, 4:37 PM IST

ఏం అభివృద్ధి చేశారని తిరుపతిలో ఓటు అడుగుతున్నారు: వర్ల
ఏం అభివృద్ధి చేశారని తిరుపతిలో ఓటు అడుగుతున్నారు: వర్ల

రెండేళ్లలో రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని తిరుపతి పార్లమెంట్​కు ఓటు అడుగుతున్నారని వైకాపాను.. తెదేపా నేత వర్ల రామయ్య నిలదీశారు. అవినీతి, అసమర్థతలతో పూర్తిగా సతమతమవుతున్న వైకాపా ఓ దొంగలముఠాతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పోలీసులు కొంచెం నిక్కచ్చిగా వైకాపా వాహనాలన్నీ తనిఖీ చేస్తే, అవినీతి సొమ్ము గుట్టలు గుట్టలుగా బయటపడుతుందన్నారు. నిజాయితీపరులైన నలుగురు పోలీస్ అధికారులను మంత్రి పెద్దిరెడ్డికి షాడో పార్టీగా పెడితే తిరుపతి పార్లమెంట్ ఎన్నికలో వైకాపాకు డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details