ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Varla: 'రాజకీయ పునరావాస కేంద్రంగా పోలీసు ఫిర్యాదుల సెల్​ను మార్చొద్దు'

By

Published : Jun 21, 2021, 10:36 PM IST

పోలీసు ఫిర్యాదుల సెల్​ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చటం తగదని తెదేపా నేత వర్ల రామయ్య ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలీసు ఫిర్యాదుల సెల్ ఛైర్మన్​గా విశ్రాంత న్యాయమూర్తి కనగరాజ్ నియామకాన్నిఆయన తప్పుబట్టారు.

varla ramaiah comments on pca chairman
వర్ల రామయ్య

పోలీసు ఫిర్యాదుల సెల్ ఛైర్మన్​గా విశ్రాంత న్యాయమూర్తి కనగరాజ్ నియామకాన్ని తెదేపా నేత వర్ల రామయ్య తప్పుబట్టారు. పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యతను వైకాపా నేతలు, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆరోపణలున్న కనగరాజ్​కు అప్పగించటం అభ్యంతరకరమన్నారు.

"పోలీసు ఫిర్యాదుల సెల్​ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చటం తగదు. గత రెండేళ్లలో వైకాపా ప్రభుత్వం ఎన్నో అడ్డగోలు నియామకాలు జరిపింది. నిష్పాక్షపాతంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషన్​ను రబ్బర్ స్టాంప్​గా మార్చారు. రాజ్యాంగవ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజాస్వామ్య విలువలను జగన్ మంటగలుపుతున్నారు. రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగబద్ధ పదవుల్లో నియామకాలు చేపట్టాలి." అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details