ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో శానిటైజర్ తాగి ఇద్దరు మృతి - శానిటైజర్ తాగి విజయవాడలో ఇద్దరు మృతి

మద్యానికి బానిసై శానిటైజర్ సేవించి మరణిస్తున్న వారి సంఖ్య విజయవాడలో పెరుగుతోంది. నగరంలోని కొత్తపేట రాజుగారి వీధిలో సీరం నాగేశ్వరరావు, వించిపేటలోని తోటకూర భాగ్యరాజు.. ఇదే తీరుగా ప్రాణాలు కోల్పోయారు.

two persons died in vijayawada by drinking sanitizer
విజయవాడలో శానిటైజర్ సేవించి ఇద్దరు మృతి

By

Published : Mar 24, 2021, 10:48 PM IST

విజయవాడలో శానిటైజర్ మరణాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ప్రాణాలు ఇలాగే బలయ్యాయి. కొత్తపేట రాజుగారి వీధిలో సీరం నాగేశ్వరరావు అనే వ్యక్తి మద్యానికి బానిసై.. శానిటైజర్ సేవించాడు. తీవ్ర కడుపు మంటతో జీజీహెచ్​లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

వించిపేటలో నివాసముండే తోటకూర బాగ్యరాజు సైతం.. మద్యానికి బానిసై శానిటైజర్ సేవించి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని శానిటైజర్ అమ్మకాలపై పోలీసులు దృష్టి సారించారు.

ABOUT THE AUTHOR

...view details