ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్​లకు బదిలీలు, పోస్టింగ్​లు

రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగ్​లు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

By

Published : Oct 13, 2020, 9:37 PM IST

రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్​లకు బదిలీలు, పోస్టింగ్​లు
రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్​లకు బదిలీలు, పోస్టింగ్​లు

ఐదుగురు ఐపీఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగ్​లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్​లో ఉన్న ఐపీఎస్ అధికారి ఆర్.కె.మీనాను గ్రేహౌండ్స్​, ఆక్టోపస్ విభాగాలకు సంబంధించి అదనపు డీజీ ఆపరేషన్స్​గా పోస్టింగ్ ఇచ్చింది. ఏసీబీ డైరెక్టర్ శంకబ్రత బాగ్చీని ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీపీగా బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న త్రివిక్రమ వర్మను గుంటూరు రేంజ్ ఐజీగా నియమించారు. ఇంటెలిజెన్స్ డీఐజీ జి.విజయ్ కుమార్​ను హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. సుధీర్ కుమార్ రెడ్డిని విజిలెన్సు, ఎన్ ఫోర్సుమెంట్ విభాగంలో ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details