దసరా సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు భారీగా సాగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు 3.55 లక్షల వాహనాలు ఎక్కువగా ప్రయాణించాయి. నిరుడు లాక్డౌన్ నిబంధనల కారణంగా ఆర్టీసీ బస్సులు నడవలేదు. వ్యక్తిగత వాహనాలు అంతంతమాత్రంగానే నడిచాయి. ఈసారి పరిస్థితులు మెరుగుపడటంతో పాటు ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్ మార్గంలో ప్రజలు భారీగా ప్రయాణాలు చేశారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలోని పలు టోల్ప్లాజాల వద్ద ట్రాఫిక్ గంటల తరబడి నత్తనడకన సాగింది. సుమారు 98 శాతం వరకు ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు జరిగాయి. గతేడాది ఇవి 68 శాతమే ఉన్నాయి. దసరా సందర్భంగా నాలుగు రోజుల్లో ప్రయాణించిన వాహనాల నుంచి టోల్ ద్వారా నిరుటి కన్నా ఈసారి సుమారు రూ.3.75 కోట్ల అదనపు ఆదాయం లభించటం విశేషం. గత సంవత్సరం రూ.11.95 కోట్లు రాగా.. ఈ దఫా రూ.15.70 కోట్ల ఆదాయం లభించింది. నిరుడు 7,31,840, ఈసారి 10,86,795 వాహనాలు రాకపోకలు సాగించాయి.
ఒక్క రోజే 46,500...