ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7pm - ఏపీ ప్రధాన వార్తలు

.

top news @7pm
ప్రధాన వార్తలు @ 7pm

By

Published : May 22, 2020, 7:00 PM IST

  • సీఎం సమాధానం చెప్పాలి.

డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి, ఏపీ పోలీస్ వ్యవస్థకు చెంపపెట్టని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పీజీ మెడికల్ కౌన్సెలింగ్​కు కసరత్తు

పీజీ మెడికల్ మొదటి విడత కౌన్సెలింగ్​కు విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కసరత్తులు ముమ్మరం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం..

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సస్పెన్షన్‌ ఎత్తివేత

ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. రక్షణ పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్​ చేసింది. దీనిపై ఏబీవీ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్​ను ఆశ్రయించగా క్యాట్​ ఆయన సస్పెన్షన్​ను సమర్ధించింది. దీనిపై ఏబీవీ వేసిన రిట్​ పిటిషన్​ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆయనపై క్యాట్​ ఉత్తర్వులను ఎత్తివేస్తూ ఆదేశాలిచ్చింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కూలీల తరలింపునకు ఏర్పాట్లు

వలస కార్మికుల తరలింపునకు బస్సులు, రైళ్లు ఏర్పాట్లు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 2 లక్షల మంది ప్రాణాలు సురక్షితం!

లాక్​డౌన్​పై సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్​డౌన్ విధించడం వల్ల 36 నుంచి 76 లక్షల వరకు కరోనా కేసులను అరికట్టగలిగినట్లు తెలిపింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రవాసులకు శుభవార్త

ఓసీఐ కార్డు హోల్డర్లలను భారత్​లోకి అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం విధించిన ప్రయాణ ఆంక్షలు వీరికి వర్తించవని స్పష్టం చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అందంగా ఉన్నాడు కదూ!

టాలీవుడ్​ యంగ్​హీరో నాగచైతన్య ఆయన భార్య సమంత కలిసి రానా, మిహీకాల రోకా వేడుకలో సందడి చేశారు. ఆ ఫంక్షన్​లో చైతూకు సంబంధించిన ఒక ఫొటోను ఇన్​స్టాలో పంచుకుంటూ.. "నా భర్త చాలా అందంగా ఉన్నాడు కదా" అని మురిసిపోతున్నారు సమంత. ఈ పోస్ట్​పై నాగచైతన్య కామెంట్​ చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారతపై ఆస్ట్రేలియా ఆశాభావం

ఈ ఏడాది చివర్లో టీమ్​ఇండియాతో జరిగే నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ నిర్వహణపై ఆశాభావం వ్యక్తం చేస్తోంది క్రికెట్​ ఆస్ట్రేలియా. ప్రణాళిక ప్రకారం సిరీస్​ జరిపి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విమానం కూలి 107 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పాకిస్థాన్​ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details